- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు..ఉదయం శవమై కనిపించాడు..

దిశ,వలిగొండ: అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని ఎదుల్లగూడెం స్టేజి సమీపంలో ప్రధాన రహదారి ప్రక్కన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన సందెల శివయ్య (44) ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వేములకొండకు కిరాయికి మాట్లాడుకొని వెళ్లినట్టు తెలుస్తొంది. రాత్రి 8 గంటల వరకు సందెల శివయ్య ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య ఫోన్ చేయగా..వేములకొండకు కిరాయికి వచ్చిన, వస్తానని సమాధానం చెప్పాడు. అనంతరం రాత్రి 11 గంటల వరకు కూడా రాకపోవడంతో..ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తోటి ఆటో డ్రైవర్లకు ఫోన్ చేయగా.. కనిపించలేదని సమాధానం చెప్పారు. సోమవారం ఉదయం వలిగొండ మండలం ఎదుల్లగూడెం స్టేజి సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి వద్ద సెల్ ఫోను,ఆటో కూడా లేకపోవడంతో హత్య చేశారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు. మృతుడికి భార్య శారద, కూతుర్లు తేజస్విని,మాన్య ఉన్నారు.