- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేర ప్రవృత్తిని కలిగి ఉంటే సమాజంలో విలువ ఉండదు

దిశ, సూర్యాపేట: మానవ జీవన శైలిలో నేర ప్రవృత్తిని కలిగి ఉంటే సమాజంలో విలువ ఉండదని, సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జి. రాజగోపాల్ సంభోదించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించి అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి వారి కేసుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. మానవ జీవన విధానంలో ఉన్న మనం నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని, మంచి మార్గంలో జీవిస్తూ సమాజంలో ఆదర్శంగా ఉండాలని కోరారు. ఏ వ్యక్తి అయినా నేరానికి పాల్పడే ముందు తన తల్లిదండ్రులు, భార్య పిల్లలు వారి జీవిత భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉద్బోధించారు. గంజాయి, మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. కష్టించి ఉపాధి మార్గాన్ని ఎంచుకుని తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని సాకుతూ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
నేర రహిత సమాజ రూపకల్పనలో మనం భాగస్వాములు కావాలని, చట్టాలకు లోబడి జీవిస్తూ బ్రతుకులు చక్కదిద్దుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో జడ్జి వెంట డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిళ్లై యాదవ్ , డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకటరత్నం, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ ఏడేండ్ల అశోక్, సూపరింటెండెంట్ కె. పద్మజ, జైల్ సూపరింటెండ్ సుధాకర్ రెడ్డి, కోర్టు సిబ్బంది, సబ్ జైలు సిబ్బంది ఉన్నారు.