- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హాలియా- యాచారం బస్సు పునరుద్ధరణ

దిశ, హాలియా : హాలియా నుండి యాచారం,మారేపల్లి మీదుగా నల్లగొండ వరకు బస్సును పునరుద్దరించాలని హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. గత కొన్ని సంవత్సరాలుగా హాలియా - యాచారం బస్సు కనగల్ మారేపల్లి యాచారం రామడుగు మీదుగా హాలియా నైట్ హాల్ట్ బస్సు నడిచేది. కాగా ఆర్టీసీ గత సంవత్సర కాలంగా బస్సును రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో మారేపల్లి గ్రామానికి చెందిన హారూన్ అంజద్ అనే హైకోర్టు న్యాయవాది గత నెల బస్సు పునరుద్ధరణ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు పిటిషన్ పై స్పందించి హాలియా- యాచారం బస్సు వెంటనే పునరుద్ధరించాలని ఆర్టీసీని ఆదేశించింది. అంతేకాకుండా ఆయా గ్రామాల ప్రజలు గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి దృష్టికి తీసుకు రావడంతో ఎమ్మెల్యే పలుమార్లు ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపారు.
దీంతో బస్సు పునరుద్ధరణ పై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించడం తో పాటు హైకోర్టు ఆదేశాలతో మంగళవారం హాలియా- యాచారం బస్సును పునరుద్ధరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు మార్గం సుగమం అయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి హైకోర్టు న్యాయవాది హారూన్ అంజద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.