- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్లో ఉంటూనే ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టానికి పని చేశా: గుత్తా జితేందర్ రెడ్డి
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉదయం ఓ పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రం కల్లా మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవలే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టానికి పని చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో జగదీష్ రెడ్డిని, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టానికి వంద శాతం పని చేశానని గుత్తా జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా మండలి చైర్మన్ సోదరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమికి పని చేశానని చెప్పడం గులాబీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.