- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుండాలలో గూడు పుఠాని..చనిపోయిన వ్యక్తుల భూములే టార్గెట్..

దిశ,నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు రోజుకు రియల్ కేటుగాళ్ళు అధికారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి అలాంటి సంఘటన ఆలస్యంగా యాదాద్రి జిల్లా గుండాల మండలం లో వెలుగు చూసింది.ఈ తతంగం కి పూర్తిగా అధికారులు అయిన తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి చేయలేని పనిని చేతులు తడుపగానే చేసి పెట్టారు అసలు ఏం జరిగింది అధికారులు రియల్ వ్యాపారులు,ధరణి ఆపరేటర్ చేసిన నిర్వాకం తెలిస్తే ఔరా అనాల్సిందే.సుమారు 9.17 ఎకరాల భూమిని అప్పనంగా కాజేశారు.
అసలేం జరిగింది..
గుండాల మండలం తుర్కల షాపురం గ్రామానికి చెందిన ఎండి యుసుఫాద్దీన్ కి గుండాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 177/1, 177/2 లో మొత్తం గా 9 ఎకరాల 17 గుంటల భూమి తనకు కలదు.అతడు గత కొన్ని ఏండ్ల క్రితం మృతి చెందడం జరిగింది.ఆ భూమి కి సంబంధించి ఎవరు లేరు అని రియల్ వ్యాపారులు,ధరణి ఆపరేటర్ అలాగే ఆర్ ఐ తో కలిసి జట్టుగా వీరు అక్రమ రిజిస్ట్రేషన్ కి తెరలేపారు.అతని పేరు మీద ఆన్లైన్ లో భూమి చూపిస్తున్న విషయం గమనించిన డాక్యుమెంట్ రైటర్ అలాగే కొందరు కుమ్మకై అతని భూమి పక్కాగా స్వాహా చేయాలని ప్లాన్ చేశారు.గత ఏడాది డిసెంబర్ లో అతని డిజిటల్ సంతకం పెండింగ్ లో ఉంది అని తహసీల్దార్ కు దరఖాస్తు చేశారు.
చనిపోయిన వ్యక్తి పైన ఉన్న భూమి వారసత్వ పట్టా చేయకుండా చనిపోయిన అతని స్థానంలో ఒక డమ్మీ వ్యక్తిని ఎండీ అబ్రహం ని ఎండి యుసుఫాద్ధి న్ గా ఆధార్ కార్డులో మార్చారు.దానిని వేరే వ్యక్తి కి అమ్ముతున్నట్లు మొదటగా ఐదు ఎకరాల భూమి ని గుండాల కి చెందిన మాధారబోయిన నర్సింహులు కి అలాగే 4 ఎకరాల 17 గుంటల భూమిని మంద మహేశ్వరి కి ఆ నకిలీ వ్యక్తి ఈ నెల 11న రియల్టర్లు తహశీల్దార్ సమక్షంలో రిజిస్ట్రేషన్ చేశారు.వెంటనే అనుమానం వచ్చిన ఎమ్మార్వో జలజ వారిని పిలిచి ఇది మీ భూమి నే నా అని నిలదీసి ఈకేవైసి చూడగా తప్పిదం జరిగినట్లు గుర్తించి వెంటనే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేశారు.
నన్ను తప్పుదోవ పట్టించారు: గుండాల ఎమ్మార్వో జలజ..
9.17 ఎకరాల భూమి పట్టా గురించి నా వద్దకు డిజిటల్ సంతకం కోసం అలాగే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వాటిని ధ్రువీకరణ చేయాల్సిందిగా ఆర్ ఐ కు తెలుపగా నాకు తప్పుడు నివేదిక ఇచ్చారు అని అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ధరణి ఆపరేటర్ కూడా నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు అని తప్పును వెంటనే చెక్ చేసి వాటి రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయడం జరిగింది అని దీని మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయనున్నట్లు తెలిపారు.
మా ఆస్తుల జోలికి వస్తే ఊరుకోం..
తుర్కల షాపురం గ్రామానికి చెందిన యుసఫాద్దిన్ కి నలుగురు కుమారులు వారి సర్వర్, నూరువుద్దీన్, రఫీ వీరిని దిశ సంప్రదించగా మా నాన్న ఆస్తులను అక్రమంగా కాజేయాలని చూసిన వారి మీద ఫిర్యాదు చేస్తామని తెలిపారు.