రసాభాసగా మారిన ప్రజా పాలన గ్రామ సభలు

by Naveena |   ( Updated:2025-01-21 12:40:50.0  )
రసాభాసగా మారిన ప్రజా పాలన గ్రామ సభలు
X

దిశ, కోదాడ : కోదాడ మండల పరిధిలోని గుడిబండ,కాపుగల్లు, అడ్లూరు, అల్వాల్ పురం గ్రామాల్లో అధికారులు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఈ సందర్భంగా గ్రామసభలో గతంలో సంక్షేమ పథకాలకు అప్లై చేసుకున్న లబ్దిదారుల లిస్ట్ ను అధికారులు గ్రామస్తులకు చదివి వినిపించారు. దీంతో గ్రామస్తులు తమ పేర్లు రాలేదని అనర్హుల పేర్లు వచ్చాయని, భూస్వాములకే, ధనవంతులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి పేర్లు వస్తున్నాయని అధికారులను ప్రశ్నించడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో అధికారులు అర్హులు ఎవరైనా ఉంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆ గ్రామ నాయకులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వాజిద్ అలీ, ఎంపీడీవో రామచంద్రరావు, డిప్యూటీ తాసిల్దార్ సూరయ్య ,ఎంపీఓ పాండురంగన్న, ఏఓ రజని, ఏపీఓ టానియా, కార్యదర్శులు వెంకట్ నారాయణ, రమాదేవి, ఆబెదబెగం, కావ్య, నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed