రసాభాసగా గ్రామసభ..

by Aamani |
రసాభాసగా గ్రామసభ..
X

దిశ,కేతేపల్లి : గ్రామ అభివృద్ధి పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభ కాస్త రసాభాసగా మారిన సంఘటన కేతేపల్లి మండలం లో చీకటి గూడెం గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఐబీ ఏఈ మహేష్ అధ్యక్షతన గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికి స్థానికులు మాజీ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావులు పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ సమయపాలన పాటించడం లేదని ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ ప్రశ్నించారు.

దీంతో మండల పరిషత్ సమావేశానికి వెళ్లాల్సి ఉందంటూ అధికారులు గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు. దీన్ని నిరసిస్తూ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు ప్రత్యేక అధికారి మహేష్,పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ లను అడ్డుకున్నారు. ఈ దశలో కొందరు స్థానికులు కార్యదర్శికి మద్దతుగా నిలవడంతో సమావేశం రసాభాసగా మారి వాదోపవాదాలకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు శాంతించి అధికారులు గ్రామ సభను ముగించి మండల పరిషత్ సమావేశానికి వెళ్లారు.



Next Story