- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేపు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..
by Sumithra |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రానున్నారు. దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం కొండపైన యాగశాలలో నిర్వహించే మహాపూర్ణాహుతిలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరుతారు. 11 గంటల వరకు యాదగిరిగుట్ట కొండపైకి చేరుకొనున్నారు. ప్రధానాలయ ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలకు వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. అనంతరం స్వయం భూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Next Story