- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారింపు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, సూర్యాపేట : వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున,అధిక ప్రాధాన్యతని ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో నిర్మితం కానున్న సూపర్ స్పెషాలిటీ,టీచింగ్ ఆసుపత్రి స్థలాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో వైద్యుల కొరత లేకుండా ఉండేందుకు అన్ని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. సర్వే నెం.765 అండ్ 766 లో గల 5 ఎకరాల 8.5 గుంటల స్థలంలో రూ.190.50 కోట్లతో చేపట్టే సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి,టీచింగ్ ఆసుపత్రి పనులను సత్వరమే చేపట్టాలని డిజేపిఆర్ కన్స్ట్రాక్షన్ అధిపతి శశిభూషన్ తో పాటు సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.
పక్కనే ఉన్న పాత పాలిటెక్నిక్ కళాశాల వివరాలను మంత్రి అడిగి తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సమీప పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మురళీధర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కోటా చలం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, ఈఈ ఎంఏ.అజీజ్,తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎస్పీ రవి, వివిధ విభాగాల వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.