District Collector : చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

by Naveena |
District Collector : చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
X

దిశ, రామన్నపేట: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. ఆదివారం మండలంలోని తుమ్మలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినారు. రైతులు ధాన్యాన్ని కావాల్సిన తేమశాతం వచ్చేవరకు అన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో వి.శేఖర్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ సి.లాల్ బహదూర్, రెవెన్యూ ఇన్సి పెక్టర్ లు శోభ, రాజేష్, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఐకెపి ఎపిఎం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed