- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాలకవీడులో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయాలి

దిశ నేరేడుచర్ల / పాలకవీడు: పాలకవీడు మండలం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె ప్రభుత్వం పక్కా భవనాలను నిర్మాణించాలని సీపీఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలం ఏర్పాటు అయినప్పటి నుంచి రెవెన్యూ పోలీస్ స్టేషన్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎంపీడీవో ఆఫీస్లో అద్దె భవనాలల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్థలం గుర్తించినప్పటికీ ప్రభుత్వ ఆఫీసుల పక్కా భవనాల ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆరోగ్య సబ్ సెంటర్ భవనం ఉన్న కనీస మౌలిక సదుపాయాలు లేవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి పూర్తిస్థాయిలో డాక్టర్లను అందుబాటులో ఉంచి ఆరోగ్య సేవలను అందించాలని కోరారు. తాగునీటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాగునీటి సౌకర్యం లేదని మిషన్ భగీరథ నీరు కూడా సక్రమంగా రావడం లేదని దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించి తాగునీటిని అందించాలని ఆయన కోరారు.