- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పల్లె ప్రకృతి వనంలో గోంగూర తోట..

దిశ, అనంతగిరి : గ్రామీణ ప్రాంత పల్లెలను పచ్చదనంతో కళకళలాడాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. లక్షల రూపాయలతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పచ్చదనంతో నిండిన ఈ ప్రకృతి వనంలో పల్లెవాసులు సేదతీరేందుకు దోహదపడతాయని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. కానీ కొన్ని చోట్ల ప్రజలకు ఉపయోగపడుతున్న పల్లె ప్రకృతి వనాలు, మరికొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాకు గురవుతున్నాయి. వివరాల్లోకెళితే అనంతగిరి మండలం ఖానాపురం ఆవాస గ్రామమైన అజ్మీర్ తండా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైందని గ్రామస్తులు, గిరిజనులు ఆరోపిస్తున్నారు.
ప్రకృతి వనంలో చుట్టూ ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉన్న చెట్లను తొలగించి ఒక కజ్జాదారుడు గోంగూర తోట వేయటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే అధికారులకు తెలిసే జరుగుతుందా అనే అనుమానం గ్రామ ప్రజల్లో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు కజ్జాకు గురి కాకుండా కఠిన చట్టాలను తీసుకొస్తుంది. ఇలాంటివి అధికారులకు తెలియదా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్లీ పకృతి వనాన్ని ఆహ్లాదకరంగా వృక్షజాతితో నింపాలని ప్రజలు కోరుకుంటున్నారు.