- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దామరచర్లలో 27 లక్షల విలువైన బంగారం అపహరణ

దిశ , మిర్యాలగూడ టౌన్ : నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయ శ్రీ జ్యువెలరీలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్ ధ్వంసం చేసి సుమారు 27 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు వాడపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు షాప్ యజమాని కాలే బ్రహ్మయ్య తెలిపారు. దీంతో సంఘటనా స్థలాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐపీఎన్ డి.ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నల్గొండ నుంచి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
షాపులో ఉన్న సీసీ పుటేజీ దొరకుండా హార్డ్ డిస్క్ ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గొంగతానలకు పాల్పడిన దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల ఆధారాల కోసం పక్కన ఉన్న షాపులలో సీసీ పుటేజీ పరిశీలించారు. మండల కేంద్రంలోని అద్దంకి - నార్కట్పల్లి ప్రధాన రహదారి ఉన్న బంగారం షాపులోనే దొంగతనం జరగటం పై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ పీఎన్డీ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన వెంట వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.