నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారం చోరీ

by Naresh |
నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారం చోరీ
X

దిశ, చివ్వెంల: అర్ధరాత్రి నిద్రిస్తున్న మహిళ మెడలోంచి బంగారం చోరీ చేసిన ఘటన తిమ్మాపురం గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన 85 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు కళ్ళు రాములమ్మ ఆమె ఇంటి ముందర రేకుల క్రింద వరండాలో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆమె నోరు మూసి 4 తులాల పుస్తెలతాడు దొంగిలించుకొని పారిపోయినాడు. ఆమె అరుపులు విని పక్క ఇంట్లో పడుకున్న కొడుకు మల్లారెడ్డి, కోడలు లేచి రాగా నేరస్తుడు అప్పటికే పారిపోయాడు. బాధితురాలి కొడుకు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బీరెల్లి వెంకటరెడ్డి తెలిపారు.

మండల ప్రజలకు పోలీసుల వారి సూచన

గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు గ్రామంలో సంచరిస్తున్నట్లయితే వారిని పట్టుకుని పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు. కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ పై తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నారని సమాచారం. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.



Next Story