శుభ కార్యానికి వెళుతూ.. అనంత లోకాలకు

by Naresh |
శుభ కార్యానికి వెళుతూ.. అనంత లోకాలకు
X

దిశ, అరవపల్లి (జాజిరెడ్డిగూడెం): శుభకార్యానికి తన అన్న ఇంటికి బయలుదేరిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట - జనగాం జాతీయ రహదారిపై శనివారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని గోపాల్ రెడ్డి నగర్ వద్ద జరిగింది. అర్వపల్లి ఎస్ఐ ఐ. మహేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు గ్రామానికి చెందిన గంట ఎల్లమ్మ (42) తన భర్త ముత్తయ్యతో పాటు, తిమ్మాపురం గ్రామానికి చెందిన బంధువులతో శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామానికి శుభ కార్యానికి ఆటోలో బయలుదేరారు. కొద్ది సేపటి తర్వాత జనగాం వైపు నుంచి సూర్యాపేటకు అతివేగంగా వెళ్ళుతున్న కారు ఆటోను ఎదురుగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్ర రక్త గాయాలు కావడంతో 108 వాహనంలో సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, మృతురాలు కోడూరు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు.



Next Story

Most Viewed