- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెత్త బండికి ఇంధన గండం..

దిశ, నాగార్జునసాగర్ : పట్టణ ప్రగతి వచ్చాక మున్సిపాలిటీల్లో నిధులకు కొరత లేదని ప్రభుత్వం చెబుతుండగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపాలిటీలో డీజిల్కు పైసల్లేక చెత్త సేకరణ వాహనాలన్నీ మున్సిపాలిటీకే పరిమితమయ్యాయి. స్థానిక పైలాన్ కాలనీ పెట్రోల్బంక్కు ఆరు నెలలుగా రూ.4 లక్షలకు పైగా బకాయి ఉండడం, ఎంతకీ చెల్లించకపోవడంతో బంక్యాజమాని డీజిల్ పోసేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో నందికొండ మున్సిపాలిటీ పట్టణంలోని కాలనీల్లో చెత్త ఎక్కడికక్కడా పేరుకుపోయింది. చెత్త సేకరణ వాహనాలన్నీ మున్సిపాలిటీకే పరిమితమయ్యాయి. దీంతో 45 రోజులుగా చెత్త వాహనాలు రావడం లేదనీ స్థానికులు వాపోతున్నారు.
మున్సిపల్ కమిషనర్ ఏమన్నాడంటే..
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను చరవాణిలో వివరణ కోరగా... చెత్త సేకరణ వాహనాలు డీజిల్ లేక కార్యాలయ ఆవరణలో నిలిచిపోయాయని తెలిపారు. పెట్రోల్ బంకు వారికి మున్సిపల్ ట్రెజరీ నుండి డబ్బులు చెల్లించకపోవడం వల్లే డీజిల్ పోయలేమని చెప్పినట్లు వివరించారు. చెక్కులకు బదులు తమకు డబ్బులు చెల్లిస్తే ఈ తతంగం త్వరగా పూర్తవుతుందని బంకు యజమానులు తెలిపారన్నారు. ఈ విషయమై పై అధికారులతో చర్చించినట్లు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ వివరించారు
ఐదు నెలలుగా జీతాలూ ఇవ్వట్లే..
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకే పెద్ద కష్టం వచ్చింది. దుమ్ము, ధూళితో నిత్యం పోరాడే వీరి నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం నందికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు