- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..చిన్నారి సహా నలుగురి మృతి

దిశ,మోత్కూరు: షిరిడి దర్శించుకుని తిరిగి వస్తుండగా ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్నట్రాక్టర్ ట్రాలీ ను ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ కేంద్రం పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి కుటుంబం దైవదర్శనానికి అల్లుళ్లతో కలిసి గత రెండు రోజుల క్రితం షిరిడి వెళ్లారు. దైవదర్శన అనంతరం తిరిగి వస్తుండగా తెల్లవారుజామున షిరిడి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తి భార్య ప్రేమలత(58), కుమార్తె పప్పి(40)మనమరాలు అక్షిత(22) తోపాటు ఆరు నెలల మనవడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో కృష్ణమూర్తి అతని కుమారుడు అల్లుడు మరో మనవరాలు తీవ్రంగా గాయపడినట్లు అందులో ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. కృష్ణమూర్తి కుమారునికి గత ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరగగా..ఆ దంపతులకు ఆరు నెలల క్రితం మగ పిల్లవాడు జన్మించడంతో మొక్కు తీర్చుకోవాలని షిరిడి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణమూర్తి తన కుమారునితో పాటు ఇరువురు కూతుర్లతో చేసిన ప్రయాణంలో భార్య, మనుమడు ,కూతురు, మనవరాలు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడం పట్ల సంఘటనను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.