ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తా…

by Naresh |
ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తా…
X

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా గుర్తించి అన్నింటినీ పరిష్కరిస్తానని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అన్నారు. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వైస్ చైర్ పర్సన్ అలక సరితతో కలిసి మున్సిపల్ ఆఫీస్‌లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీ నాయకులను కలుపుకొని పార్టీలకతీతంగా పని చేస్తానని అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని సమస్యలు గుర్తించారని వాటికి బడ్జెట్ సరిగా లేనందున మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి సహకారంతో ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. గతంలో మున్సిపల్ మీటింగ్ హాల్‌లోనికి విలేకరులకు ఎంట్రీ లేదని ఇప్పటి నుంచి ప్రతి మీటింగ్‌కి విలేకరులకు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న బడ్జెట్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.



Next Story

Most Viewed