యాదాద్రి కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రచ్చ..అసలు ఏం జరిగింది అంటే..?

by Aamani |
యాదాద్రి కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రచ్చ..అసలు ఏం జరిగింది అంటే..?
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల రచ్చ మొదలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలోని ఎస్ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా నూతన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం జనవరి 26 సందర్భంగా ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ మొదలయ్యింది. కొన్ని ఫ్లెక్సీలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫోటో వేయకపోవడం కొన్ని ఫ్లెక్సీ లలో చిన్నగా వేయడంతో గొడవ నెలకొన్నది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి ఫోటోలు పెద్దగా వేయడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు బీర్ల ఐలయ్యను నిలదీశారు. ఇది జిల్లా కాంగ్రెస్ కార్యాలయమా ...? లేక బీర్ల ఐలయ్య కార్యాలయమా....? అంటూ నిలదీశారు. మోటకొండూరు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫోటోలు మాత్రమే ఉండడం భువనగిరి పట్టణ కాంగ్రెస్ శ్రేణులకు అభ్యంతరకరంగా మారింది. డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సైతం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫోటోలు ప్రాధాన్యత లేకుండా చిన్నగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీర్ల ఐలయ్య ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. బీర్ల ఐలయ్య కావాలనే ఇలా చేయించారని భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.



Next Story