- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒక్క ఐడియా ఆ విద్యార్థి జీవితాన్నే మార్చేసింది

దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన ఎడవెల్లి మహేష్ బాబుకు గతంలోనే తల్లిదండ్రులు మరణించారు. మహేష్ బాబు చదువు పై శ్రద్ధ ఉండడంతో అతని పరిస్థితులు గమనించిన అదే గ్రామానికి చెందిన యువకులు జీడిమెట్ల రవి ఉట్కూరి భార్గవ సైదులు గ్రామంలోని వాట్సప్ గ్రూపుల ద్వారా అతని పరిస్థితిని గ్రామస్తులకు వివరించారు. దాంతో అతని పరిస్థితి గమనించిన పలువురు రవికి సైదులుకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అలాగే కొందరు నగదు ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.
వారు సేకరించిన నగదు 34 వేల రూపాయలను గ్రామ పెద్దసహకారంతో శుక్రవారం ఆ విద్యార్థికి అందజేశారు. ప్రస్తుతం మహేష్ బాబు మిర్యాలగూడలోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. అతనికి 447/470 మార్కులతో పాసయ్యాడు. అతనికి ప్రస్తుత విద్యా పరమైన అవసరాల మేరకు ఈ డబ్బుని అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాబురావు, వల్లంశెట్ల.మట్టపల్లి రావు, ఇంజమూరి వెంకటయ్య, సిద్ధపంగ సైదులు, పెండెం హరిబాబు, అల్వాల శ్రీధర్, సిద్ధపంగా సైదులు, కోడి పవన్, వెంకట నర్సు, ఏసు, రాహుల్, పొలం చెట్ల భుజంగరావు, నందమూరి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.