- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరికొద్ది గంటల్లో ప్రణయ్ పరువు హత్య కేసు తుది తీర్పు

దిశ, నల్లగొండ: మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. 2018 జనవరిలో అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని అమృత తండ్రి మారుతీరావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14 న ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ని అతి కిరాతకంగా చంపారు. ఇదే విషయంపై మిర్యాలగూడ 1 టౌన్లో ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాల స్వామి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. 2020లో అమృత తండ్రి బలవన్మరణం చేసుకున్నాడు. కాగా నేడు ఉదయం 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసుతీర్పుతో ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అతని తండ్రి బాలస్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ హత్య కేసులో నిందితుల మీద పోలీసులు 302,120బిఎస్సి, ఎస్టీ సెక్షన్ కింద మొత్తం ఎనిమిది మంది మీద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఏ1గా మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మ ఏ3 గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దుల్ బారి, ఏ5గా కరీం, ఏ6 గా శ్రవణ్, ఏ 7 గా శివ, ఏ8గా నదీమ్ ఉన్నారు. ఇక ఇందులో ఏ1గా ఉన్న మారుతి రావు ఇప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఇరుపక్షాల వాదనలు విని ఈ రోజు ఉదయం జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. తమ కుటుంబానికి, తన కొడుక్కి న్యాయం జరగాలని ప్రణయ్ తండ్రి పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజులుగా కోర్టు చుట్టూ తిరుగుతూ.. బాలస్వామి కుటుంబ సభ్యులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై కోర్టు తుది తీర్పు ఇవ్వనుండటంతో ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.