- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పండుగలా సన్న బియ్యం పంపిణీ..

దిశ, మర్రిగూడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే సన్న బియ్యం కార్యక్రమాన్ని మంగళవారం పండుగలా అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపును మామిడి తోరణాలతో అలంకరించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపు 18 వద్ద తహశీల్దార్ బక్క శ్రీనివాసులు ప్రారంభించారు. నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్రావు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని అన్నారు.
గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే పేద ప్రజలు అమ్ముకునే వారిని సన్న బియ్యంతో పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి మాజీ సర్పంచ్ మాస నీలిమ శేఖర్ మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల లోకేష్ ఎలిమినేటి సత్తిరెడ్డితో పాటు ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.