- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేగంగా ఆస్తి పన్ను వసూళ్లు… మున్సిపల్ ఖాతాలో రూ.4 కోట్లు

దిశ,నల్లగొండ బ్యూరో : మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను మున్సిపల్ సిబ్బంది వేగంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఉన్న పెండింగ్ బకాయి రెండు దృష్టిలో పెట్టుకొని... మరోసారి ఆ స్థాయిలో బకాయిలు పెరిగిపోకుండా ఉండేందుకు అధికారులు ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే పన్ను వసూళ్లలో వేగంగా అడుగులు వేస్తూ టార్గెట్ నిర్ణయించుకొని మరి పన్ను వసూలు చేస్తున్నారు.
5 శాతం రాయితీ సౌకర్యం..
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.17.75 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నెలలో రూ.8 కోట్లు వరకు పన్ను వసూలు టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు దాదాపు రూ.4 కోట్ల వరకు పన్ను వసూలు చేశారు. ఇంకా రూ.4 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేస్తే అధికారులు నిర్ణయించుకున్న లక్ష్యం పూర్తవుతుంది.. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ నెలలోపు రూ.5 శాతం రాయితీ సౌకర్యం కల్పించి నట్లు సమాచారం.
బకాయిలపై రాయితీ సౌకర్యం లేదు..
2024--25 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మున్సిపాలిటీ ఉన్న సంవత్సరాల తరబడి ఆస్తిపన్ను చెల్లించకుండా ఇంటి యజమానులు వివిధ కార్యాలయాల ప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల ఏరియర్ డిమాండ్ రూ.15 కోట్లు కాగా, దానికి పెనాల్టీ రూ.14 కోట్లు ఉందని తెలుస్తోంది. అయితే మొత్తంగా రూ.29 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. అయితే ఈ పెండింగ్ ఆస్తి పన్ను చెల్లించాలని గతంలో బకాయిదారులకు రాయితీ సౌకర్యం కల్పించారు. అయినా పన్ను చెల్లింపు కి ఆసక్తి చూపలేదు. అందువల్లే ఈ బకాయి ఆస్తి పన్నుకు ఎలాంటి రైతు సౌకర్యం లేదని సమాచారం.
మే నుంచి మొండి కాయలపై దృష్టి.....!
నల్గొండ మున్సిపాలిటీ పట్టణ ప్రజల నుంచి ఆస్తి పన్ను రూపంలో రావాల్సిన రూ.29కోట్ల ను వసూలు చేయడానికి మే 1వ తేదీ నుంచి మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. మార్చి 31 నాటికి అనేక రకాల రాయితీ సౌకర్యం కల్పించినప్పటికీ బకాయి దారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అందుకే పెండింగ్ ఆస్తి పన్ను వసూలు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా స్పందించకుండా ముందుకేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని పన్ను వసూలు చేయనున్నారని సమాచారం.
పట్టణ అభివృద్ధికి సహకరించండి..: సయ్యద్ ముసాబ్ అహ్మద్,మున్సిపల్ కమిషనర్
పట్టణంలో జరిగే అభివృద్ధిలో ప్రజలు చెల్లించి ఆస్తి పన్ను సొమ్ము కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను వీలైనంత తొందరగా చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.. ఆస్తిపన్ను వసూలుకు ప్రతి ఇంటికి వస్తున్న మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నా.
పన్ను చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు : శివరాంరెడ్డి ,రెవెన్యూ ఇన్స్పెక్టర్, నల్లగొండ మున్సిపాలిటీ
ఈ ఆర్థిక సంవత్సరం తో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తిపరులు బకాయిలను వెంటనే చెల్లించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని, ఆస్తులు కూడా జప్తు చేస్తాం. ఆస్తి పన్ను తీసుకోవడానికి ప్రతి ఇంటికి వస్తున్న మున్సిపల్ సిబ్బందికి పట్టణ ప్రజలు సహకరించాలి.