గిట్టుబాటు ధర అందించాలని రైతుల రాస్తారోకో

by Aamani |
గిట్టుబాటు ధర అందించాలని రైతుల రాస్తారోకో
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం రోడ్డులో అవంతిపురం మిల్లు ల వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ క్వింటాకు కేవలం 2400 మాత్రమే చెల్లిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమావేశాలు నిర్వహించి నప్పటికి ఎలాంటి ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సంఘటన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.



Next Story

Most Viewed