- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయిస్తా : మునుగోడు ఎమ్మెల్యే

దిశ,మర్రిగూడ ( నాంపల్లి): సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు . ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి ,ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయించి అద్దాలు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం లోని ప్రతి మండలం లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కంటి రుగ్మతలు లేకుండా వైద్య పరీక్షలు చేయిస్తానని పేర్కొన్నారు. ఇటీవల మునుగోడు ,చండూరు మండల కేంద్రంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కంటి వైద్య సేవలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో వైద్య శిబిరానికి వచ్చి కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ జడ్పిటిసి పూల వెంకటయ్య ఏవి రెడ్డి నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరానికి అన్యుహ స్పందన..
నాంపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో అన్యుహ స్పందన లభించింది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు రావడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు గత వారం రోజుల నుంచి విస్తృతంగా కంటి వైద్య శిబిరం పై ప్రచారం నిర్వహించడం తో కంటి రుగ్మతలు ఉన్నవారు అధిక సంఖ్యలో పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజలు కంటి వైద్య శిబిరానికి తరలి రావడంతో ప్రజలు క్యూ లైన్ లో బారులు తీరారు. దీంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కంటి వైద్య శిబిరం లో పాల్గొన్న కంటి వైద్య నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన వారికి స్థానిక నాయకులు భోజన సదుపాయం కూడా కల్పించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.