- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిడమనూరు మార్కెట్ పాలకవర్గం కొలువుదీరేదెన్నడో

దిశ, నాగార్జున సాగర్: నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ వర్గంలోని ఏ నాయకుడిని వరిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిడమానూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కోసం ఆశావహులు అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. త్రిపురారం, నిడమనూరు మండలాల పరిధిలో విస్తరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు . మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ జనరల్ కేటగిరికి కేటాయించడంతో చైర్మన్ గిరి పై ఆశలు పెట్టుకున్న రెండు మండలాలకు చెందిన నేతలు ఇప్పటికే బడా నాయకుల ఆశీస్సుల కోసం తంటాలు పడుతున్నారు.
మార్కెట్ రేసులో నిడమనూరు, మండలానికి ఎమ్మెల్యే అనుచరులతో పాటు నిడమనూరు మాజీ ఎంపీపీ యడవల్లి రంగశాయి రెడ్డి అనుచరుల్లో ఒకరైన మొదటి నుంచి తన వెంటే ఉంటూ వచ్చింది మాజీ జెడ్పీటీసీ అంకతిరుక్మిణి సత్యం, వెంకటరమణ నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకతి సత్యం అదేవిధంగా నిడమానూరు మండలంలోని రాజన్నగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి ముంగి శివ మారయ్య యాదవ్, సైదయ్య పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీసీ జనరల్ స్థానంలో అగ్రవర్ణాల వారికి అవకాశం కల్పించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతకుముందు త్రిపురారంకు కేటాయించిన పదవిని తిరిగి అదే మండలానికి ఇవ్వడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్ఠానం చైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేసే యోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
నియాజకవర్గంలో మరింత ఉత్సాహంతో వుంది. ఈ నేపథ్యంలో బీసీ జనరల్ స్థానంలో ఆ సామాజిక వర్గం ఆశగా ఎదురుచూస్తుంది.ఎమ్మెల్యే అంతరంగం అంతుచిక్కక తమకున్న సంబంధాలను తమ ఎంపికకు ఉపయోగించుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. దీంతో మార్కెట్ రాజకీయం రసవత్తరంగా మారింది యువ ఎమ్మెల్యే తన అనుచరుల్లో మార్కెట్ పదవిని ఎవరికి కట్ట పెడతారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎలాగైనా పదవిని దక్కించుకోవాలన్న తపనతో ఎమ్మెల్యే ఎదుట ఇప్పటికే తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన నాయక గణం ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు తమ విధేయతను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నట్లు సమాచారం. మాజీ సర్పంచ్ అంకతి వెంకటయ్య, మాజీ ఎంపిటిసి ముంగి శివ మారయ్య యాదవ్,గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని అవకాశాల కోసం పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తే ఊరుకునేది లేదని, అదే జరిగితే ఎన్నికల్లో దండయాత్ర తప్పదని కొందరు నిజాయితీ కార్యకర్తలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. మార్కెట్ చైర్మన్ పదవి నియామకంలో అధిష్టానం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.