వేలం ద్వారా ఎక్సైజ్ కు రూ. 2.50 లక్షల ఆదాయం…

by Kalyani |
వేలం ద్వారా ఎక్సైజ్ కు రూ. 2.50 లక్షల ఆదాయం…
X

దిశ, తుంగతుర్తి: క్రైమ్ కేసులలో పట్టుబడ్డ వివిధ రకాల ద్విచక్ర వాహనాలకు గురువారం తుంగతుర్తి ఎక్సైజ్, ప్రొహిబిషన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన వేలంపాట ద్వారా రూ.2 లక్షల 50 వేల ఆదాయం లభించింది. అంతేకాకుండా మరో రూ.45 వేలు జీఎస్టీ కింద జమ అయ్యాయి. మొత్తంగా 12 వాహనాలకు వేలం పాట నిర్వహించగా 8 మాత్రమే పలువురు దక్కించుకున్నారు. జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ రజిత, ఎస్సైలు మూర్తి, జయప్రకాష్ లు పాల్గొన్నారు.



Next Story