గుడుంబా తయారీ కేంద్రాల పై ఎక్సైజ్ పోలీసుల దాడులు..

by Sumithra |
గుడుంబా తయారీ కేంద్రాల పై ఎక్సైజ్ పోలీసుల దాడులు..
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : నాటు సారా తయారీ కేంద్రాల పై స్థానిక పోలీసులు ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాలో గురువారం దాడులు నిర్వహించిన పోలీసులు 10 లీటర్ల నాటు సారాను ఆంబోతు షీలా, కాట్రోతు బుజ్జి ల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికంగానే నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని కనిపెట్టి ధ్వంసం చేశారు.

నాటసారాకు ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ములు, ఇతర పాత్రలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తుల పై కేసులు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో నాటుసారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ దాడులలో రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ బాలాజీ నాయక్, ఎక్సైజ్ ఎస్సై ఎన్ శంకర్, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సీఐ బి. రాధా కిషన్, స్థానిక ఎస్సై జగన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed