వనదేవతల జాతరకు సర్వం సిద్ధం

by Naresh |
వనదేవతల జాతరకు సర్వం సిద్ధం
X

దిశ, పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పరిధిలోని పొట్టిచెలిమ వద్ద వెలసిన గిరిజనుల ఆరాధ్యదైవంగా కొలుస్తున్న, సమ్మక్క సారక్క జాతర ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త గుంజ అంజమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ… తమిళనాడు దివంగత సీఎం జయలలిత పీఏ మీనమ్మ తరుపున అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, బెల్లం, నూతన పట్టు వస్త్రాలు ప్రతి జాతరకు పంపిస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క- సారలమ్మ మినీ మేడారం జాతర కొండా కోన పరవశించేలా సంబరాలు జరుగుతున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కుంభమేళా గా పేరుగాంచిన ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోందని తెలిపారు. ఈ జాతరకు నల్గొండ, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పొట్టిచేలిమ వద్ద సమ్మక్క, సారక్క, నాగులమ్మ దేవతలకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు వనదేవతలకు పసుపు, కుంకుమలతో బెల్లం, వడి బియ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం వల్ల బాధలు పోయి సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే వాన దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరను ఆర్గనైజర్ గుంజ కృష్ణం రాజు, దేవాలయం అధ్యక్షుడు నాగపురి లక్ష్మి రామస్వామి, బోర్డు ఆఫ్ ట్రస్ట్ ,మహా లక్ష్మి వారి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి.



Next Story

Most Viewed