ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

by Naresh |
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
X

దిశ, నకిరేకల్ టౌన్: ప్రతి ఒక్కరు భక్తి భావంతో ముందుకెళ్తూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.నకిరేకల్ మండలం చందం పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…. యువత భక్తి భావంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామంలో భక్తి ఉట్టిపడేలా దేవాలయాల పునర్నిర్మానాలు జరుగుతున్నాయన్నారు. దాతలు సైతం దేవాలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నూకల రఘునందన్ రెడ్డి, గాధ గొని శంకర్, గాధ గొని మహేష్, యాదయ్య, పాలడుగు యాదయ్య, మాచర్ల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed