ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోండి: ఎమ్మెల్యే కూసుకుంట్ల

by Disha Web Desk 11 |
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోండి: ఎమ్మెల్యే కూసుకుంట్ల
X

దిశ, చండూరు: ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చు్కోవాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుప్పల మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం జడ్పీటీసీ వీరమళ్ళ భానుమతి వెంకటేశం గౌడ్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ సర్పంచ్ రోజా, ఎంపీటీసీ అవ్వరి గీత, ఎంపీటీసీ 2 చేరుపల్లి భాస్కర్, దేవాలయం అధ్యక్షుడు అవ్వరి శ్రీనివాస్, ఇడం కైలాశ్, నామని గోపాల్, ఇడం గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed