భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి : మంత్రి ఉత్తమ్

by Kalyani |
భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి : మంత్రి ఉత్తమ్
X

దిశ, కోదాడ : భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ లో ఓటు హక్కు ను వినియోగించుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటివరకు ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నేను ఓటు వేశాను మీరు ఓటు వేయండి అన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతి టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేఎల్ ఏన్ ప్రసాద్ ,ఈదుల కృష్ణయ్య తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed