- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలి : కలెక్టర్

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సమయపాలన పాటించాలన్నారు. పాఠశాలలో ఉన్న మౌళిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలను, వంట చేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఉత్తమ ఫలితాలు వచ్చేలా సాధన చేయించే దిశగా.. ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు. కిచెన్ షెడ్ లేకపోవడంతో, ఏఈ కి ఫోన్ చేసి కిచెన్ షెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీభా, జ్యోతి శంకరయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.