- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

దిశ, మునుగోడు: ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం అలవర్చుకోని జీవితంలో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని,కస్తూర్బా పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. బీసీ బాలుర వసతి గృహం ఇంచార్జీ వార్డెన్ సరిత , కస్తూర్బాగాంధీ పాఠశాల ప్రత్యేకాధికారుణి పుష్పాలతలు అందుబాటులో లేకపోవడంతో.. వారికి షోకాజ్ ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. పరీక్షల సమయం సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో శాంతి కుమారి, తహసిల్దార్ నరేందర్, తదితరులు ఉన్నారు.