- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎమ్మెల్యే
by Naveena |

X
దిశ , మిర్యాలగూడ టౌన్ : ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి పని కల్పించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండల అభివృద్ధి కార్యాలయంలో బుధవారం జరిగిన ఉపాధి హమీ సోషల్ అడిట్ లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కూలీలకు సక్రమంగా పని కల్పించకపోవడంతో.. ఇందిరమ్మ అత్మీయ భరోసాకు అర్హత కొల్పోయారని పేర్కొన్నారు . ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నమునా స్ధల సేకరణ చేసి నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్డీవో శేషగిరి శర్మ , ఉపాధి హమీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story