నీ డ్రామాలు ఇంకా ఎవరు నమ్మరు.. KCR పై Etala ఫైర్..

by Dishanational4 |
నీ డ్రామాలు ఇంకా ఎవరు నమ్మరు.. KCR పై Etala ఫైర్..
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా పానగల్లులో పచ్చల సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రను ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రగతి భవనంలో, ఫామ్ హౌస్‌లో పడుకునే సీఎంకు బీజేపీ అంటే భయం పట్టుకుందని, అడబిడ్డల అభయహస్తం పథకంను రద్దు చేసింది కేసీఆర్ అని అన్నారు. వడ్డీ లేని రుణాలు లేవని.. 400 కోట్లు బకాయిల పెట్టిండని వ్యాఖ్యనించారు. రైతాంగాన్ని మోసం చేసిన వ్యక్తి ఈ సీఎంమేనని, అలాగే రైతు రుణమాఫీ ఎందుకు చేస్తాలేడని ప్రశ్నించారు. 54 లక్షల మంది రైతు కుటుంబాలు ఉంటే.. 24లక్షల మంది రైతులకు బ్యాంక్‌ల్లో రుణాలు ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ వస్తే మన బిడ్డలను విదేశాలలో బ్రతికే స్థాయి తెస్తా అన్నాడని గుర్తుచేశారు. నౌకర్లు వచ్చే వరకు నిరుద్యోగులకు ఇస్తానన్నా నిరుద్యోగ భృతి ఎక్కడ పోయిందని విమర్శించారు.

అలా ఇస్తాన్న నిరుద్యోగ భృతి దాదాపు ఒక నిరుద్యోగికి ఒక లక్ష 50 వేల రూపాయల పైన రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయ్ కానీ, కాళ్ళు మాత్రం తంగేళ్ళు దాటవని ఎద్దేవా చేశారు. అంతేకాక వితంతు మహిళలకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, దళిత బంధు, గిరిజన బంధు తరహాలో.. వితంతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కాలంలో అటుకులు తిని ఉపసం ఉన్న కేసీఆర్‌కి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు. మునుగోడులో ఓటుకు వేలు కట్టబెట్టారని ఆరోపించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేది బీజేపీనని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు నుండి బయటకు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. రాబోయే కాలంలో కషాయం జెండా ఎగరడం ఖయయని ఆశభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజానీకానికి బంధం తెగిపోయిందని, నీ డ్రామాలు ప్రజలు నమ్మరని వ్యాఖ్యనించారు.

Also Read....

కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది: Etela


Next Story

Most Viewed