- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జీతాలు ఇస్తలేరని ఉద్యోగుల నిరసన..
by Sumithra |

X
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతి గూడెం గ్రామంలో గల కెమికల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సోమవారం ఉద్యోగులు కంపెనీకి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, యాజమాన్యాన్ని ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటూ సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో, నల్లగొండ లేబర్ కార్యాలయంలో, ఆర్టీసీ క్రాస్ రోడ్ లేబర్ కార్యాలయంలో వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశామన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులిచ్చేలా చొరవ చూపాలని కోరారు.
Next Story