చౌటుప్పల్ లో వృద్ధుడి ఆత్మహత్య

by Naveena |
చౌటుప్పల్ లో వృద్ధుడి ఆత్మహత్య
X

దిశ, చౌటుప్పల్ టౌన్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై-కేసారం గ్రామంలో చోటు చేసుకుంది. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన సాల్వాది శంకరయ్య (65) అనే వృద్ధుడు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన శంకరయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు తెలిపారు.



Next Story

Most Viewed