- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తా

దిశ, సూర్యాపేట : ప్రకృతిని ప్రసాదించే పర్యటన అభివృద్ధి సంస్థ చైర్మన్గా నన్ను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి చిరకాలం ఋణపడి ఉంటానని రాష్ట్ర పర్యటన అభివృద్ధి సంస్థ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాను చిన్నప్పటి నుంచి పర్యావరణ ప్రేమికుడినని, ఆ అంశాన్ని సీఎం గుర్తించారో లేక యాదృచ్ఛికంగా ఎంపిక చేశారో తెలియదు కానీ పర్యాటక అభివృద్ధి సంస్థకు నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉందని పటేల్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదని నన్ను నమ్ముకొని నా వెన్నంటి ఉన్న ప్రతి కార్యకర్తలకు దక్కిన గౌరవంగా అందరూ భావించాలని వెల్లడించారు. ఆది నుండి నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పని చేసినందునే పార్టీ ఈరోజు నాకు ఈ పదవిని కట్టబెట్టిందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక పర్యాటక ప్రాంతాలైన ఉండ్రుగొండ, దురాజ్ పల్లి, పిల్లలమర్రి, అన్నారం, నెమ్మికల్, పణిగిరి, సద్దుల చెరువులను అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన అభిమానులు పూలబొకేలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, డా. రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్ షఫీ ఉల్లా, తండు శ్రీనివాస్ గౌడ్, నిమ్మల వెంకన్న, వల్దాస్ దేవేందర్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, పిల్లల రమేష్ నాయుడు, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.