- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది

దిశ, నేరేడుచర్ల: విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని మండల విద్యాధికారి చత్రు నాయక్ ఆకాంక్షించారు. నేరేడుచర్ల మండలంలోని రామగిరి వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు . ఈ సందర్భంగా గుడుగుంట్ల పాలెం ఎంపీటీసీ దొంగల వెంకటయ్య మాజీ సర్పంచ్ బూచేపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ… పాలకవీడు మండలంలోని గుడుగుండ్ల పాలెం గ్రామంలో బీసీ గురుకుల నిర్మాణం కోసం స్థలం గుర్తించామని దానిని ఇప్పటికే చదును చేయడం జరిగిందని స్థలంలోని త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో భవనం నిర్మాణం చేస్తామన్నారు.
దీనికి సహకరిస్తున్న వారందరికీ ప్రిన్సిపాల్ అనిత కృతజ్ఞతలు తెలిపారు . అలాగే గతంలో ఈ పాఠశాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రోగ్రాంలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులకు మెమొరాండం అందజేశారు. ప్రిన్సిపాల్ అనిత ఆధ్వర్యంలో ఎంఈఓ ఎంపీటీసీ మాజీ సర్పంచులకు సన్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టేజిపై విద్యార్థినీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత ఇంచార్జ్ ప్రిన్సిపల్ సీహెచ్ రేణుక వార్డెన్ ఏ. త్రివేణి టీచర్లు పాల్గొన్నారు.