- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గంప గుత్తగా నల్గొండ పార్లమెంట్ ఎన్నికల విధులకు డుమ్మా

దిశ,నల్గొండ: పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి పోలింగ్ సెంటర్లలోకి కూడా చేరుకుంది. కానీ నల్లగొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారులు,అథర్ పోలింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు 48 మంది రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఇంత వరకు రిపోర్ట్ చేయలేదు, విధులకు హాజరు కాలేదు. కావున వారి మీద దేవరకొండ అసెంబ్లీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి.శ్రీనివాసులు దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వారి మీద ఐపీసీ సెక్షన్ 134 ఆర్పీ ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో నల్లగొండ జిల్లా ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మొదటి నుంచి నల్లగొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన అధికారులు విధులకు హాజరు కావాలి అని శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేశారు. అయిన వారు విధులకు హాజరు కాకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ విషయమై జిల్లా ఎస్పీ చందన దీప్తి వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.