- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ
దిశ,శాలిగౌరారం : భూ వివాదంలో న్యాయం చేయాలని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం..శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సంకటి సత్తమ్మ తన వ్యవసాయ భూమిలో ఉన్న నాలుగు బోరు స్టార్టర్లు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తేది 3.12.2024 నాడు పట్టుకెళ్లారు. దీంతో సత్తమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో ఆత్మహత్యే శరణ్యం అని సెల్ టవర్ ఎక్కినట్లు సంకటి సత్తమ్మ తెలిపారు. సెల్ టవర్ ఎక్కిన సత్తమ్మ గంటసేపు ఎంతమంది వారించిన దిగకపోవడంతో..పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో సెల్ టవర్ దిగి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఆమె సెల్ టవర్ ఎక్కేటప్పుడు పురుగుల మందు తీసుకుపోవటంతో..తాగిందనే అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎస్ఐ సైదులు వివరణ
స్టార్టర్లు తీసుకెళ్లినా వారిపై ఫిర్యాదు ఇచ్చిన వెంటనే వారిపై తేది 3.12.2024 నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. సంకటి సత్తమ్మ ఫిర్యాదుపై ఎలాంటి నిర్లక్ష్యం చేయట్లేదని వివరణ ఇచ్చారు. వాళ్ళకు భూ తగాదలు ఉన్నాయి,అవి ఇరు వర్గాలు కోర్ట్ ద్వారా పరిష్కరించుకోవాలి,వాటిని పోలీసులు పరిష్కరించలేరని తెలిపారు.