- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేసవిలో తాగునీరు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి : సూర్యాపేట కలెక్టర్

దిశ,హుజూర్ నగర్ : వేసవిలో తాగునీరు , విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ తెలిపారు.శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా హుజూర్ నగర్ డివిజన్ లోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హుజూర్ నగర్ డివిజన్లోని గ్రామాల వారిగా మంచినీటి సరఫరా పరిస్థితిని ఎంపీడీఓలు, మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలు వారీగా అందుకు సంబంధించి అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
వేసవిలో తాగునీటి సమస్యలు, కరెంట్ కోతలకు సంబంధించి గతంలో జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలోని ఆవాసాలలో అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బోరు బావులను బాగు చేయాలన్నారు. వేసవి ప్రభావం ఇప్పటినుండే ప్రారంభమైందని నీటి ఎద్దడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని, కావున పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 15 రోజుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆవాస ప్రాంతాలలో సరఫరా సమస్యలు ఉంటే పైపులైను వెంటనే మరమత్తులు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ సోర్సులను కూడా పరిశీలించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు రోడ్లు పనులు జరిగేటప్పుడు ముందుగా పంచాయతీ సెక్రటరీలకు ఆర్అండ్బీ అధికారులు సమాచారం ఇవ్వాలని తెలిపారు. హుజూర్ నగర్ డివిజన్లో 221 గ్రామాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో ఉన్న 345 ట్యాంకులను కంపల్సరిగా క్లోరినేషన్ చేయాలని ,శుభ్రంగా ఉండాలని తెలిపారు.
అలాగే నేరేడుచర్ల ,హుజూర్ నగర్ మున్సిపల్ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ,కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలన్నారు. ఉపాధి హామీ పనులకు కూలీలను గ్రామాల వారిగా సేకరించి పనులను చేపట్టాలన్నారు. పంచాయతీ సెక్రెటరీలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎంపీడీవోల ద్వారా తన దృష్టికి తేవాలని తెలిపారు. అధికారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వాడాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, ఆర్డీవో శ్రీనివాసులు, డిపిఓ నారాయణరెడ్డి , తాహసిల్దార్ ఎం. నాగార్జున రెడ్డి , ఈ ఈ ఇంట్రా వై. శ్రీనివాస్ ఈఈ గ్రేడ్ అరుణాకర్ రెడ్డి ,హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు కె .శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి ఎంపీడీవో లు ,ఎంపీలు పంచాయతీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.