- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తహసీల్దార్ కార్యాలయంలో తాగునీరు కటకట

దిశ,చివ్వేంల : మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తాగునీటి కటక ట నెలకొన్నది. ప్రతి రోజు వివిధ పనుల మీద సుమారు 100 మంది వరకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ ఉంటారు. అయినా కార్యాలయంలోనే తాగేందుకు గుక్క నీటి చుక్క కరువైంది. దీంతో కార్యాలయ సిబ్బంది, పనుల నిమిత్తం వచ్చే సందర్శకులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేసవి కాలం కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నామంటే తాగునీటిని వెంట తీసుకెళ్తున్నారు. తాగునీటిని వెంట తెచ్చుకోని వారు దప్పికను తట్టుకోలేకపోతే సమీపంలోని కిరాణం షాప్ కి వెళుతున్నారు. అయితే ఇతర అవసరాల కోసం నీటి లభ్యత ఉన్నప్పటికీ తాగునీరే కరువైంది. ఈ మేరకు పరిష్కా ర మార్గంగా కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు. వేసవి కాలం లో కార్యాలయం కు వచ్చే సందర్శకులకు ఏర్పాటు చేయాలి. కానీ యంత్రాంగంలో చలనం కరువైందని సందర్శకులతో పాటు సిబ్బంది వాపోతున్నారు.
తాగు నీరు అందుబాటులో ఉంచాలి : అనంతుల మధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మండల ప్రజలు రిజిస్ట్రేషన్ లతోపాటు, వివిధ భూ సమస్యల మీద నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ ఉంటారు. మనిషికి అన్నం పెట్టే భూమికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే తహసీల్దార్ కార్యాలయంలోనే తాగునీరు లేకపోవడం విచారకరం. పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న పలువురు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేసవి కాలం కావడంతో సమస్య మరింత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయంకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి.