ప్రజలు ఆందోళన చెందవద్దు

by Naveena |
ప్రజలు ఆందోళన చెందవద్దు
X

దిశ,భూదాన్ పోచంపల్లి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని,ప్రజలు ఆందోళన చెందవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని 4,7,11 వార్డులతో పాటు..మండలలోని కనుముకుల, దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డి పల్లి, జూలూరు, పెద్దగూడెం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలకు ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు ఎంపిక కాని వారు ఉంటే మళ్లీ గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ యోగ్య భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, ప్లాట్లు, లేఅవుట్లు వంటి భూములకు వర్తించదని తెలిపారు. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు జారీ చేయడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిపిఓ సునంద ,ఎంపీడీవో భాస్కర్, ఇన్చార్జ్ తహసిల్దార్ నాగేశ్వరరావు,కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, గుండు మధు, భోగ భానుమతి విష్ణు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి, తడక రమేష్, సుర్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story