- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ చేప పిల్లలు మాకొద్దు
by Naveena |

X
దిశ,గుర్రంపొడు :గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ప్రభుత్వ ఉచితంగా చెరువులకు సరఫరా చేస్తున్న చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని, అందులోనూ సగం చనిపోయి ఉన్నాయని మత్స్య సహకార సంఘం సభ్యులు చేప పిల్లల్ని తిరిగి వెనక్కి పంపారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో మత్స్యకారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో.. ఎంతో ఖర్చు పెట్టి ఉచితంగా చెరువులకు చేప పిల్లల్ని పంపిస్తుంటే అధికారులు కాసులకు కక్కుర్తి పడి,కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసి రకం చేప పిల్లల్ని తెచ్చి చెరువుల్లో పొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడిన అధికారులను, కాంట్రాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు కోరుతున్నారు
Next Story