నాణ్యతలో రాజీ పడొద్దు

by Sridhar Babu |
నాణ్యతలో రాజీ పడొద్దు
X

దిశ, హుజూర్ నగర్ : కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో చేపట్టబోయే పనుల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన పనులను చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హుజూర్ నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి రోడ్లు మరియు భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో రెండు నియోజక వర్గాల్లో చేపట్టే పనులు, జరుగుతున్న పనులు, అలాగే కొత్త పనుల ప్రతిపాదనపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 85 పనులకు రెండు నియోజకవర్గాలలో కొత్త పనులు, రెన్యూవల్ పనులకు రూ. 124.65 కోట్లు నిధులు చేయడం జరిగిందని అన్నారు. నియోజక వర్గాల్లో త్వరలో చేపట్టే పీఆర్ పనుల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో ఉండాలని నిర్దేశించిన సమయానికి పనులను పూర్తి చేసి అందించాలని సూచించారు. అదే విధంగా ఆర్ అండ్ బీ శాఖ ద్వారా

హుజూర్ నగర్ నియోజక వర్గం లో 35 రహదారుల నిర్మాణం కోసం రూ. 267 కోట్లు, అలాగే కోదాడ నియోజక వర్గంలో 7 పనులకు రూ. 156 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా రెండు నియోజక వర్గాల్లో రెండు పవర్ ట్రాన్స్​ఫార్మర్​ల ఏర్పాటుకు రూ.15 కోట్లు అలాగే రెండు సబ్ స్టేషన్ల ఏర్పాటుకు 5 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అదే విధంగా ఆదనవు ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 1.8 కోట్లు అలాగే విద్యుత్ కెపాసిటీ పెంచుటకు రూ. 1.7 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. అలాగే 133 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ కొరకు రూ. 1.92 కోట్లు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రైతులకు, గృహాలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరం అందించాలని , ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మేళ్లచెరువు రామాపురం,కోదాడ లో షాదీఖాన స్థల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు.

అలాగే స్థానికంగా రింగ్ రోడ్డు పనుల కేసు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టౌన్ హాల్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. కోదాడ నియోజక వర్గంలో గల మునగాల కొక్కిరిని బిడ్జి ని త్వరలో శాసన సభ్యురాలుతో కలిసి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. నియోజక వర్గాల్లో చేపట్టిన రెండు పథకాల గదుల ఇండ్ల వివరాలు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా కోదాడ, హుజూర్ నగర్ లో వసతి గృహాలకు నిధులు మంజూరు చేసి త్వరలో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, అలాగే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం

హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట సమీపంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన 2160 సింగిల్​ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టామన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి మంత్రులు హుజూర్ నగర్ వచ్చినప్పుడల్లా పూర్తి చేస్తామని చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా పనిచేయలేదని విమర్శించారు. తిరిగి మా ప్రభుత్వం వచ్చిన

ఆరు నెలల లోపే 74 కోట్లను తీసుకువచ్చామన్నారు. ఈ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నామని డిసెంబర్ నాటికి పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా మొదలు పెట్టబోతున్నామని తెలిపారు. ప్రతినెలా సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్సీ రాజేశ్వర రెడ్డి, ఈఈ భాస్కర్ రావు, డీఈ రమేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ పాల్ రాజ్, డీఈ వెంకట కృష్ణ, పీఆర్ ఎస్సీ రామకృష్ణ, ఈఈ వెంకటయ్య ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed