- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ భూమి ఎవరికి పట్టా చేయొద్దు

దిశ, నల్గొండ: మాకు రావాల్సిన భూమి తమకు తెలియకుండానే వేరే వ్యక్తులకు పట్టా చేస్తున్నారని దాన్ని మాకే చేయాలని భూతగాదాలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ యాదాద్రి జిల్లా గుండాల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాడ బోయిన వెంకటయ్యకు ముగ్గురు బిడ్డలు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసిన వెంకటయ్య తనకున్న భూమిలో పెద్ద బిడ్డ కొండ బోయిన సోమక్క పేరున 4.08 ఎకరాలు, మూడో బిడ్డ సంగి రామక్క పేరున 7 ఎకరాలు రాయగా, రెండో బిడ్డ లచ్చమ్మకు పెళ్లి చేసి భూమి మాత్రం రాయలేదు. రామక్క చనిపోగా ఆమె కొడుకు స్వామి, కోడలు సుమలత భర్తను వదిలేసి ఇంటి వద్దనే ఉంటున్న సోమక్కను గత కొన్నేళ్లుగా తమ వద్దే ఉంచుకుంటూ ఆమె పేరున ఉన్న 4.08 ఎకరాల భూమి కూడా తమకే అవుతుందని ఆమె బాగోగులు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా రెండో బిడ్డ లచ్చమ్మ కూతురు పద్మ, మనుమరాలు అశ్విని ఆ భూమిలో తమకు భాగం ఇవ్వాలని సోమక్కను దగ్గరకు తీసుకున్నారు. స్వామి, సుమలతకు తెలియకుండా పద్మ, అశ్విని సోమక్క పేరున ఉన్న 4.08 ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందిన వ్యక్తులకు అమ్మి శుక్రవారం రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. విషయం స్వామి, సుమలతలకు తెలియడంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ఆపాలని, తమకు న్యాయం చేయాలని సుమలత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని ఆ భూమి తనకే వర్తిస్తుంది అని నాకు న్యాయం చేయాలని కోరుతూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకోగా అక్కడ ఉన్న కొందరు అడ్డుకున్నారు.స్థానిక గుండాల పోలీసులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన కౌన్సిలింగ్ ఇచ్చారు. సర్వే నెంబర్ 199 ఆ/1లో 4.08 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం మేడిపల్లికి చెందిన లక్కాకుల కరుణాకర్ స్లాట్ బుక్ చేసుకోగా వివాదం కారణంగా రిజిస్ట్రేషన్ నిలిపివేశామని, విచారణ జరిపి ఆ భూమి ఎవరి పేరును సక్రమంగా ఉంటే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ జల కుమారి తెలిపారు.