చండూరులో వీధి కుక్కల స్వైర విహారం..

by Sumithra |
చండూరులో వీధి కుక్కల స్వైర విహారం..
X

దిశ, చండూరు : విధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురి పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన శనివారం మండల పరిధిలోని పలు గ్రామలతో పాటు మున్సిపాలిటి పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కరోజే ఎనిమిది మంది పై కుక్కలు దాడి చేసి గాయపరచటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురైతున్నారు. వివిధ పనుల పై దారిన పోతున్న వాహన దారులను వెంబడించి దాడి చేస్తున్నాయని పలువురు వాపోతున్నారు.

శనివారం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు, బంగారుగడ్డ గ్రామానికి చెందిన ఒకరు, గట్టుపల్ మండలం తెరటుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కుక్క కాటుకు గురయ్యారని ప్రభుత్వ వైద్య అధికారి రాజు తెలిపారు. మున్సిపల్ కేంద్రానికి చెందిన ఆరు సంవత్సరాల బాలునితో పాటు, బంగారుగడ్డ గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాబు కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed