గొర్రెల మందపై కుక్కల దాడి.. 120 గొర్రెలు మృత్యువాత

by Shiva |   ( Updated:2024-02-28 07:53:08.0  )
గొర్రెల మందపై కుక్కల దాడి.. 120 గొర్రెలు మృత్యువాత
X

దిశ, తుంగతుర్తి: ఎక్కడి నుండో వచ్చిన కుక్కలు ఫామ్ హౌస్ షెడ్‌లో ఉన్న గొర్రెల మందపై దాడికి పాల్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన దాయం రవీందర్‌రెడ్డి గ్రామ శివారులోని తనకు ఉన్న వ్యవసాయ క్షేత్రం చుట్టూ రక్షణగా ఇనుప కంచె ఏర్పాటు చేసి అందులో రెండు వందలకు‌పైగా గొర్రెలను పెంచుతున్నాడు. అయితే, రాత్రి వేళలో ఇనుప కంచెలోకి కుక్కలు చొరబడి దాదాపు 100 గొర్రెలపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

ఉదయం రోజులాగే వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కూలీలు విషయాన్ని రవీందర్ రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో సుమారు. రూ.పది లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లుగా బాధితుడు రవీందర్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి వెటర్నరీ వైద్యులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే కొత్తగూడెం గ్రామంలో మేడుదుల సోమల్లుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు ఇదే విధంగా దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితునికి రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.



Next Story

Most Viewed